తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ ‘రెట్రో’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే.. ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను మే 31న స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ మార్చారు. మే 31న కాకుండా ఒక రోజు ముందుగానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. మే 30 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమాకు థియేటర్స్లో పూర్తిస్థాయిలో దక్కని రెస్పాన్స్, ఇప్పుడు ఓటీటీలో దక్కుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జోజు జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.