సూర్య ‘రెట్రో’.. ఈ విషయంలో ఎక్కువ కంప్లైంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “రెట్రో” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో అంచనాలు ఆడియెన్స్ లో అందుకోలేకపోయింది అని చెప్పక తప్పదు. అయితే రెట్రో సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క అంశంపై ఎక్కువగా ఆడియెన్స్ లో కంప్లైంట్ వినిపిస్తుంది.

అదే ఈ సినిమా సెకండాఫ్ కోసం. మంచి ఇంట్రెస్టింగ్ గా నడిపిన ఫస్టాఫ్ తో సెకండాఫ్ పై అంచనాలు పెరిగాయి కానీ కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పుడు లానే వీక్ గా నడిపించేసరికి మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఈ నేపథ్యంలో రెట్రోకి మాత్రం ఈ అంశం హైలైట్ గా వినిపిస్తూ వస్తుంది. ఈ టాక్ తో రెట్రో వసూళ్లు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.

Exit mobile version