తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ మే 1న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. అయితే, మౌత్ టాక్తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది.
ఈ సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ముఖ్యంగా తమిళనాట ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ మూవీ ద్వారా వచ్చిన లాభాల్లో నుంచి సూర్య తాజాగా రూ..10 కోట్లు అగరం ఫౌండేషన్కు విరాళం అందించాడు. ఈ సందర్భంగా రెట్రో చిత్ర యూనిట్ కూడా సూర్య వెంట ఉన్నారు.
ఇక రెట్రో చిత్రంలో సూర్య వైవిధ్యమైన లుక్స్తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.