“పుష్ప” కోసం సుకుమార్ కొత్త అడుగు.?

“పుష్ప” కోసం సుకుమార్ కొత్త అడుగు.?

Published on May 12, 2020 8:04 PM IST

“అల వైకుంఠపురములో” లాంటి సాలిడ్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఒక పాన్ ఇండియన్ లెవెల్ సినిమా వస్తే బాగుంటుంది అని అభిమానులు అంతా ఆశించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మొత్తం 5 భాషల్లో “పుష్ప” సినిమాను అనౌన్స్ చేసేసరికి బన్నీ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ హైప్ ను సంతరించుకున్న చిత్రంగా నిలిచింది.

అలాగే దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమా కావడం మూలాన ఆ అంచనాలు మరింత పెరిగాయి. అయితే సుకుమార్ సినిమాలు అంటే ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ఉండడం ఖాయం. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రయోగంకు పూనుకున్నట్టు వినికిడి. ఈ చిత్రాన్ని పూర్తిగా భారతీయ సాంకేతికత తోనే తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.

ప్రతీ ఒక్క టెక్నిషియన్ మన దేశానికి చెందిన వారే ఈ సినిమాకు పని చేయనున్నారని పూర్తిగా మన దేశపు సినీ కార్మికులకు పని కల్పించాలనే ఆలోచనతోనే సుక్కు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇందుకు కరోనా కారణాన్ని పక్కన పెడితే ఈరోజుల్లో ప్రతీ చిన్న సినిమాకు విదేశాల్లో షూట్ చేస్తున్నారు.

అలాంటి సుకుమార్ తీసుకున్న ఈ కొత్త స్టెప్ నిజమైతే రాబోయే సినిమాలకు ఓ చక్కటి మార్గ నిర్దేశకంగా నిలుస్తుంది. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు