టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా సుకుమార్ కి పేరుంది. హీరోని కొత్తగా ఆవిష్కరించడం సుకుమార్ గొప్పతనం. ఇక రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్, బన్నీ తో యాక్షన్ క్రైమ్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆయన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. కాగా ఈ సినిమా తరువాత సుకుమార్ ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టాలని గట్టిపట్టుదలతో ఉన్నాడట. తన స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ని ఎలాగైనా ఒప్పించాలని ఆయన ప్లాన్ అట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో మంచి హిట్ అందుకోవడంతో పాటు, ఎన్టీఆర్ ని కొత్తగా ఆవిష్కరించింది. మరో వైపు అట్లీ, ప్రశాంత్ నీల్ కూడా ఆయనతో సినిమా కోసం సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ముగ్గురు దర్శకులలో ఎవరు ఎన్టీఆర్ ని కన్విన్స్ చేస్తారో చూడాలి. ఐతే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా, త్వరలో త్రివిక్రమ్ మూవీ షూట్ లో కూడా జాయిన్ కానున్నాడు.