స్టార్ సింగర్ మరియు ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద ప్రతి విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటారు. సహాయం చేసే తీరులో కూడా తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నారు చిన్మయి. లాక్ డౌన్ కారణం అనేక మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది పేదలు, రోజూవారి కూలీలు నిత్యవసరాలు సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ వారికి సహాయం చేయడానికి వినూత్న పద్దతిని ఎంచుకున్నారు.
చిన్మయి అభిమానులు కోరిన పాటలు పాడి రూ.30 లక్షలకు పైగా నిధులు సేకరించి, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, నిరాశ్రయులకు సాయం చేసింది. చాలా వరకు నిధులు ఇచ్చినవారే స్వయంగా సాయమందించేలా కృషి చేసింది. లాక్డౌన్ ముగిసేవరకు పాట ద్వారా తన సేవలను కొనసాగిస్తానని చిన్మయి చెప్పింది. ఇప్పటివరకు దాదాపు 1700కుపైగా పాటలు పాడి, 1100కుపైగా కుటుంబాలకు చిన్మయి సాయం చేయగలిగింది. సౌత్ ఇండియాలో స్టార్ సింగర్ గా ఉన్న చిన్మయి డైరెక్టర్ మరియు నటుడు రాహుల్ రవీంద్రన్ భార్యన్న విషయం తెలిసిందే. ఈమె స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెవుతారు.