టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్తో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేశారు మేకర్స్.
కానీ, అక్కడ నెలకొన్న కఠిన పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని అక్కడ షూటింగ్ చేయలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ చిత్ర షూటింగ్ కోసం కొత్త లొకేషన్ను ఎంపిక చేశారు. టాంజానియాలోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో ఈ షూటింగ్ నిర్వహించేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు.