తెలుగు సినిమా సెట్‌లో నన్ను ఎగతాళి చేశారట !

తెలుగు సినిమా సెట్‌లో నన్ను ఎగతాళి చేశారట !

Published on Feb 17, 2025 9:00 PM IST

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేత బసు ప్రసాద్. అయితే, ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో తన ఎత్తును గుర్తు చేస్తూ సెట్‌లోని వారు ఎగతాళి చేసినట్లు శ్వేత బసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో తనతో నటించిన హీరో దాదాపు 6 ఫీట్ల హైట్ ఉండటంతో ఇలా జరిగిందని శ్వేత బసు ప్రసాద్ తెలిపింది. పైగా తనకు సంబంధించిన సన్నివేశాలను చాలా సార్లు రీటేక్ చేశారని కూడా శ్వేత బసు ప్రసాద్ చెప్పింది.

మొత్తానికి ఎప్పుడో జరిగిన సంఘటనలను శ్వేత బసు ప్రసాద్ తాజాగా చెబుతుంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే అంత సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ లేదు. పైగా ఈ బ్యూటీ హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక, పలు వివాదాల్లో చిక్కుకొని తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్నారు. మళ్లీ తెలుగు చిత్రాల్లో అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల గురించి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు