శిల్పాశెట్టి.. పేరుకు తగ్గనట్టుగానే ఒక శిల్పిలా తన శరీర సౌష్ఠవాన్ని మెయింటైన్ చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన యోగాలసనాలతో అభిమానులకు టచ్లో ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో శిల్పాశెట్టి ఫ్యాన్స్ కోసం తన కుమారుడికి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. రాజ్కుంద్రా- శిల్పా శెట్టి దంపతులకి వియాన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వియాన్ కూడా యోగాలసనాలలో తన తల్లినే ఫాలో అవుతున్నాడు. పైగా జిమ్నాస్టిక్ తో ఆకట్టుకుంటున్నాడు.
దీనికి సంబందించి శిల్పా శెట్టి పోస్ట్ చేస్తూ.. తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారో దానినే పిల్లలు ఎల్లప్పుడూ అనుకరిస్తారు. మేము వ్యాయామం చేయడం మరియు యోగా సాధన చేయడం చూసి, వియాన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్పై ఆసక్తి పెంచుకున్నాడు. పిల్లలు చాలా శక్తిని కలిగి ఉంటారు. ఆ అపారమైన శక్తిని చక్కగా మలచడం చాలా ముఖ్యం. అతను జిమ్నాస్టిక్లను ప్రేమిస్తాడు, కాబట్టి నేను ప్రోత్సహిస్తున్నాను.’ అని శిల్పా శెట్టి తన ఇన్స్టాగ్రాములో తెలియజేసింది. ఇక శిల్పాశెట్టికి సమీషా అనే చిన్నారి సరోగసీ ద్వారా జన్మించింది.