శంకర్ రాబోతున్న చిత్రం “మనోహరుడు” వీనులవిందుగా ఉండబోతుంది. విక్రం మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. చెన్నైలో పొడవయిన షెడ్యూల్ చిత్రీకరణ తరువాత ప్రస్తుతం చిత్ర బృందం చైనా వెళ్ళింది. చైనాలో అద్భుతమయిన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నట్టు నటి ఏమి జాక్సన్ వెల్లడించింది. శంకర్ చిత్రాలలో అద్భుతమయిన ప్రదేశాలను చూపించడం కొత్తేమీ కాదు ఈ చిత్రంలో చైనాలోని అందమయిన ప్రదేశాలను చూపించనున్నారు. క్రౌచింగ్ టైగర్ మరియు హిడన్ డ్రాగన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రదేశాలలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు పిసి శ్రీరాం ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.
వీనులవిందు కానున్న శంకర్ “మనోహరుడు”
వీనులవిందు కానున్న శంకర్ “మనోహరుడు”
Published on Oct 29, 2012 9:18 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ