విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు పట్టం కట్టారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ను జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను తొలుత ఓటీటీలో కాకుండా శాటిలైట్లో టెలికాస్ట్ చేసేందుకు జీ ప్లాన్ చేస్తుంది. జీ తెలుగు ఛానల్లో ఈ చిత్రాన్ని ముందుగా టెలికాస్ట్ చేస్తే, థియేటర్స్లో వచ్చిన రెస్పాన్స్ బుల్లితెరపై కూడా మరోసారి చూడొచ్చని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
అటుపై ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 5 వారాలకు ఈ చిత్రాన్ని డిజిటల్ టెలికాస్ట్ చేయనున్నారని.. ఈ లెక్కన ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఓటీటీలో కాకుండా ముందుగా టీవీ ఛానల్లో టెలికాస్ట్ కానుండటంతో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయనుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.