జూలై 20 నుండి ఆటో నగర్ సూర్య చిత్రీకరణలో సమంత

జూలై 20 నుండి ఆటో నగర్ సూర్య చిత్రీకరణలో సమంత

Published on Jul 12, 2012 11:10 PM IST


దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆటోనగర్ సూర్య” చిత్రంలో మిగిలిన చిత్రీకరణలో జూలై 20 నుండి పాల్గొనబోతున్నట్టు సమంత అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మూడు రోజుల చిత్రీకరణ తరువాత సమంత నందిని రెడ్డి చిత్రం చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ చిత్రంలో సిద్దార్థ్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ” జూలై 20 నుండి మూడు రోజుల పాటు ఆటో నగర్ సూర్య చిత్ర చిత్రీకరణలో పాల్గోనబోతున్నాను ఎవరినయిన నొప్పించుంటే క్షమించండి నేను ఏ చిత్ర ఆలస్యానికి కారణం కాదు. జూన్ మరియు జూలై మణి రత్నం గారికి ఇచ్చిన తేదీలు” అని సమంత ట్విట్టర్లో చెప్పారు ఇదే కాకుండా తను ఏ చిత్రం ఒప్పుకోలేదని ప్రస్తుతం చేస్తున్నది పూర్తి చెయ్యాలని అనుకుంటున్నానని కూడా దృవీకరించారు. దీనితో తన అనారోగ్యం మీద ఉన్న సందేహాలతో పాటు ప్రభుదేవ చిత్రం ఒప్పుకుంది అని వచ్చిన పుకార్లకు కూడా జవాబిచ్చింది. ఈ రెండు చిత్రాలు కాకుండా సమంత మహేష్ బాబు సరసన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”, “ఎటో వెళ్లిపోయింది మనసు” మరియు రామ్ చరణ్ సరసన “ఎవడు” చిత్రాలలో కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు