‘మజిలీ’.. ఆ బ్లాక్ బస్టర్స్ గుర్తు చేసుకున్న సమంత.!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే సమంత గత కొంత కాలం తెలుగు సినిమాకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సమంత నటించిన సినిమా కాకుండా తన నిర్మాణంలో తెరకెక్కించిన రీసెంట్ చిత్రంతో చాలా కాలం తర్వాత ఆమె తెలుగు ఆడియెన్స్ ని పలకరించేందుకు వస్తుంది. మరి ఆ చిత్రమే “శుభం”.

యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించారు. మరి ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో గ్రాండ్ గా జరగగా అక్కడ సమంత కామెంట్స్ ఆసక్తిగా మారాయి. తనకి వైజాగ్ కి ఉన్న బంధం కోసం మాట్లాడుతూ తాను చేసిన సినిమాల్లో మజిలీ కోసం ముందు చెప్పి ఆ తర్వాత ఓ బేబీ అలాగే రంగస్థలం చిత్రాలు ఈవెంట్స్ ఇక్కడ నుంచే అయ్యాయి అని అన్నీ హిట్స్ అయ్యాయి. ఈసారి కూడా నాకు బ్లాక్ బస్టర్ ఇస్తారా అంటూ సమంత విశాఖ ప్రజలని అడిగిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

Exit mobile version