రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ ఈ ‘విరాటపర్వం’లో కొత్త కోణాలను చాలా ఇంట్రస్ట్ గా చూపించబోతున్నాడట. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. సినిమాలో ఆమె పాత్ర చనిపోతుందని..చనిపోయే సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉండనుందని తెలుస్తోంది. మొన్న ‘వేణు ఉడుగుల’ ట్వీట్ చేస్తూ.. ‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది ? ఎవరి కోసం ఆమె నిరీక్షణ ? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి? అంటూ వేణు సాయిపల్లవి పాత్ర గురించి ట్వీట్ చేశాడు.
కాగా తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. లాక్ డౌన్ అనంతరం షూట్ చేయనున్నారు.