చైతూ పర్ఫార్మెన్స్‌ను మ్యాచ్ చేసేందుకు సాయి పల్లవి అలా చేసిందట!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో నాగచైతన్య పర్ఫార్మె్న్స్‌ను తన మాటలతో ఎలివేట్ చేసింది. ఈ సినిమాలోని ఓ సీక్వెన్స్‌లో నాగచైతన్య చేసిన పర్ఫార్మెన్స్‌ను మ్యాచ్ చేసేందుకు తాను రీ-టేక్ చేయాల్సి వచ్చిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దీనిబట్టి ఈ సినిమాతో నాగచైతన్య తనలోని పర్ఫార్మర్‌ని పూర్తిగా చూపించబోతున్నాడని అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version