ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దీనికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా, నిర్మాతగా సాహు గారపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాహు గారపాటి మీడియాతో ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ఈ చిత్ర కథ ఎలా ఉండబోతుంది..?

ఇప్పటివరకు వచ్చిన హారర్ కథల కంటే ఇది భిన్నమైన కథ. రేడియో నుంచి వచ్చే వాయిస్ చుట్టూ అద్భుతమైన హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి.

ఈ కథ విన్నప్పుడు మీ ఫీలింగ్..?

కథ విన్నప్పుడు కలిగిన ఎక్సైట్మెంట్, సినిమా చూసిన తర్వాత మరింత పెరిగింది. సినిమా టాప్ టెక్నీషియన్లతో రూపొందించబడింది.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర ఎలా ఉంటుంది..?

సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ హారర్ చిత్రంలో ఆయన నటన కొత్తగా కనిపిస్తుంది.

ఈ చిత్ర సంగీతం గురించి..?

అజినీష్ షెడ్యూల్ కుదరకపోవడంతో, చైతన్ భరత్ మ్యూజిక్ అందించాడు. రీరికార్డింగ్ అద్భుతంగా వచ్చింది.

హీరోయిన్ అనుపమ గురించి..?

ఆమెకు ఇది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్. కథ వినగానే వెంటనే ఒప్పుకుంది.

ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.?

హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, మ్యూజిక్ ఉంటాయి. థ్రిల్‌తో పాటు షాక్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది.

Exit mobile version