గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “పెద్ది”. ఫస్ట్ గ్లింప్స్ తోనే మంచి అంచనాలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి దీనికి అనుగుణంగానే బుచ్చిబాబు సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. గతంలో రంగస్థలం సినిమాకి జిగేలు రాణి ఎలాంటి హైలైట్ అయ్యిందో ఇప్పుడు ఇదే రీతిలో శ్రీకాకుళంకి చెందిన ఓ ఫేమస్ ఫోక్ సాంగ్ ని మేకర్స్ రీమిక్స్ చేస్తున్నట్టుగా రిపోర్ట్స్ అందాయి.
ఈ రిపోర్ట్ ప్రకారం శ్రీకాకుళం జానపద గేయం మా ఊరి ప్రెసిడెంటు అనే సాంగ్ ని మేకర్స్ రీమిక్స్ చేయగా ఈ సాంగ్ ని ప్రముఖ జానపద గేయకులు రచయిత పెంచల్ దాస్ (రెడ్డమ్మ తల్లి) ఫేమ్ ఆలపించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఫోక్ సాంగ్ కి రెహమాన్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి మాత్రం రంగస్థలానికి మించిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు రాబోతుంది అని చెప్పవచ్చు.