కృష్ణ..ఓకే అంటే.. వెంకీ హీరో అయ్యేవాడు కాదు..!

కృష్ణ..ఓకే అంటే.. వెంకీ హీరో అయ్యేవాడు కాదు..!

Published on Apr 22, 2020 10:43 AM IST

మూవీ మొఘల్ రామానాయుడు ఇద్దరు కుమారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారట. అందుకే వీరిద్దరిని ఉన్నతమైన చదువులు చదివించారు. చదువు పూర్తయిన సురేష్ బాబు సొంతగా ఓ ఫ్యాక్టరీ స్థాపించారట. అది అంతగా అభివృద్ధిలోకి రాకపోవడంతో తండ్రితో పాటు మూవీ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారట. ఐతే వెంకటేష్ ని కూడా మూవీ నిర్మాతగా లేదా, వ్యాపార వేత్తగా చూడాలని రామానాయుడు ఆశించారు. అందుకే ఆయన చేత యూఎస్ లో ఎమ్ బి ఏ చేయించారు.

ఐతే వెంకటేష్ హీరోగా మారడం నాటకీయంగా జరిగింది. కలియుగ పాండవులు మూవీ సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని రామానాయుడు, డైరెక్టర్ రాఘవేంద్ర రావు నిర్ణయించుకున్నారట. ఈ విషయమై కృష్ణ తో మాట్లాడగా, సరే చేద్దాం కాకపోతే ఈ మూవీ సహ నిర్మాతగా ఏ ఎస్ ఆర్ ఆంజనేయులిని తీసుకోవాలని సూచించారట. దీనికి రామానాయుడు ఒప్పుకోలేదట. దానితో రామానాయడు హీరో కోసం వెతుకుతుండగా.. సన్నిహితులు..మీ చిన్నబ్బాయి హ్యాండ్ సమ్ గా ఉన్నారు…హీరోగా చక్కగా సరిపోతాడు అని సలహా ఇచ్చారట. అలా వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు.

హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కుష్బూ ని ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం చేయడం జరిగింది. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. సంగీతం చక్రవర్తి అందించడం జరిగింది. 1986 ఆగస్టు 14న విడుదలైన వెంకీ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఈ మూవీ తరువాత వెంకటేష్ వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు