జగదేక వీరుడు పార్ట్ 2.. రామ్ చరణ్ నుంచి సర్ప్రైజ్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో వండర్ ఫుల్ హిట్ చిత్రాల్లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఫాంటసీ వండర్ చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి” కూడా ఒకటి. తెలుగు ఆడియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా 35 ఏళ్ళు తర్వాత రీరిలీజ్ కి వస్తుంది.

అది కూడా 3డిలో వస్తుంది. మరి ఈ రీరిలీజ్ కోసం మళ్ళీ మెగాస్టార్ మరియు నిర్మాత అశ్వినీదత్ లు తమ మార్క్ ప్రమోషన్స్ ని గతంలో ‘ఇంద్ర’కి చేసిన రీతిలోనే చేస్తుండగా లేటెస్ట్ గా ఓ క్రేజీ ప్రోమో వదిలారు. మరి ఇందులో మెగాస్టార్ తన మార్క్ ఎనర్జీ, టైమింగ్ తో అదరగొట్టగా లాస్ట్ లో మెగాస్టార్ వారసుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో సర్ప్రైజ్ చేయడం జరిగింది.

అయితే ఇందులో తాను జగదేక వీరుడు క్లైమాక్స్ కోసం మాట్లాడ్డం ఆసక్తిగా మారింది. పార్ట్ 2 కి ఉన్న స్కోప్ పై తాను మాట్లాడ్డం జరిగింది. చివరిలో ఉంగరం దానిని మింగిన చేప ఏమయ్యాయి అంటూ చరణ్ చెప్పడంతో జగదేక వీరుడు పార్ట్ 2 పై ఆశలు చిగురించినట్టు అయ్యిందని చెప్పాలి. ఇక ఈ ఫుల్ ఇంటర్వ్యూ అయితే ఈ మే 8న రాబోతుండగా ఇందులో పార్ట్ 2 పై మరింత క్లారిటీ రావొచ్చు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version