విలక్షణ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడుకుగా తెరకెక్కిన చిత్రం ‘ఓనమాలు’. ‘మంచి జ్ఞాపకం లాంటి సినిమా’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ స్కూల్ హెడ్ మాస్టారుగా కనిపించనున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయిక కళ్యాణి ఈ చిత్రంలో కథానాయికగా నటించారు.
ఈ చిత్రానికి కోటి సంగీతం అందించగా, ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. హరి అనుమోలు ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ మరియు ‘మీ శ్రేయోభిలాషి’ లాంటి చిత్రాలలానే ఈ చిత్రం కూడా తన కెరీర్లో ఒక చిరస్మరణీయ చిత్రంగా నిలిచిపోతుందని రాజేంద్ర ప్రసాద్ భావిస్తున్నారు.