దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. కాగా ఈ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ కోసం మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా షూట్ లో పాల్గొననుంది. వీరిద్దరి పాత్రల పరిచయాలతో పాటు కథ తాలూకు గమనాన్ని కూడా ఈ సీక్వెన్స్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది.
కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.