‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడనంటున్న రాజమౌళి !

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. కాగా ఈ లాక్ డౌన్ లో రాజమౌళి ఇప్పటికే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ చిత్రం గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. కాగా తాజా మీడియా ఇంటరాక్షన్ లో, రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. ముందు ప్రేక్షకుల అభిరుచిని విశ్లేషించుకోవాలి. లాక్ డౌన్ వల్ల వాళ్ళు వరల్డ్ సినిమాని చూశారు. మరి లాక్ డౌన్ అనంతరం వారు మన సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి’ అని చెప్పుకొచ్చారు.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version