SSMB29 పై మౌనం పాటిస్తున్న రాజమౌళి.. సరైన సమయం కోసం వెయిటింగ్..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై పలు రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా కథ రామాయణం ఆధారంగా తెరకెక్కనుందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎన్ని రకాల వార్తలు వస్తున్నా జక్కన్న మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆయన ఎప్పుడు అధికారికంగా అప్డేట్స్ ఇస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తాయో చూడాలి.

Exit mobile version