ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్లో SSMB29 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించి పలు షెడ్యూల్స్ జరుపుకున్నారు. అయితే, రాజమౌళి తన గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా కోసం తన రూటు మార్చుకున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
రాజమౌళి తన గత చిత్రాలను అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవారు. అయితే, మహేష్ బాబు సినిమాను మాత్రం ఇప్పటివరకు ఆయన అధికారికంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా చాలా సింపుల్గా చేశాడు. ఇక షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరే ఇతర అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయాలంటే అధికారికంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి మహేష్ బాబు సినిమాపై జక్కన్న ఎప్పుడు మౌనం వీడుతాడో చూడాలి.