ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రజలు సహా భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అంత ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో వారికి ఇంట్లో ఉన్నంత సేపు బోర్ కొట్టకుండా మన తెలుగు బుల్లితెర ఛానెల్స్ వారు కూడా గట్టిగానే శ్రమిస్తున్నారు. అలా గత వారం పలు ఛానెల్స్ లో టెలికాస్ట్ కాబడిన టాప్ 5 ప్రోగ్రామ్స్ జాబితా బయటకు రాగా..
అందులో వాటిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “రేసు గుర్రం” సినిమా మరియు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం “రాక్షసుడు” కూడా నిలవడం విశేషం.గత వారం జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ కాబడిన ఈ రెండు చిత్రాల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ “రేసు గుర్రం” సినిమా వచ్చి ఇన్నాళ్లు అయినా 4 లక్షల 66 వేలకు పైగా టెలివిజన్ ఇంప్రెషన్స్ రాబట్టడంతో పాటుగా 5.5 తరపు రేటింగ్ పాయింట్స్ ను సాధించింది.
అలాగే కోలీవుడ్ లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న “రాట్ససన్” సినిమాకు రీమేక్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాక్షసుడు”. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి 5 లక్షల 53 వేల టెలివిజన్ ఇంప్రెషన్స్ తో 6.5 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ను సాధించింది. ఇలా ఈ రెండు సినిమాలు గతవారపు టాప్ తెలుగు ప్రోగ్రామ్స్ లో ఉన్న ఏకైక సినిమాలుగా నిలిచాయి.