బాలీవుడ్లో ఒకప్పుడు సినిమాలు వస్తున్నాయంటే, అవి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా అని అందరూ చూసేవారు. అయితే, బాహుబలి చిత్రం తర్వాత ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. సౌత్ సినిమాలు.. ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా శాసిస్తున్నాయి. ఇప్పటికే పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపాయి.
అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా బిటౌన్కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ టాలీవుడ్ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ అయిన 6 నెలలు దాటింది. ఈ సినిమాకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. అయితే, ఈ సినిమా ఇంకా కూడా బాలీవుడ్ను ఏలుతుండటం నిజంగా విశేషమని చెప్పాలి.
ఇటీవల ఈ సినిమాను హిందీ టెలివిజన్ ప్రీమియర్గా టెలికాస్ట్ చేయగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఓ తెలుగు సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు దాటినా, అక్కడి జనాలు ఈ సినిమాకు పట్టం కడుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ ఆలోచనలో పడ్డారు. తమ ఔట్డేటెడ్ సినిమాలకు హిందీ ఆడియన్స్ కూడా ఆదరణ చూపకపోవడంతో వారు సరికొత్త ట్యాలెంట్లను వెతికే పనిలో పడ్డారు. మరి రాబోయే రోజుల్లో దక్షిణాది చిత్రాలు బాలీవుడ్లో ఇంకా ఎలాంటి వండర్స్ చేస్తాయో చూడాలి.