ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి ఉన్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ అలాగే నాగార్జున కలయికలో వస్తున్న సాలిడ్ చిత్రం “కుబేర” కూడా ఒకటి. నిజానికి ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఫైనల్ గా ఇప్పుడు విడుదలకి వస్తుంది. ఇలా వస్తుండడంతోనే మంచి బజ్ ని కూడా సంతరించుకున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగబోతుంది.
మరి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఇండియాస్ గ్రేటెస్ట్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వస్తున్నట్టుగా ఇపుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇపుడు జక్కన్న ఇచ్చే స్పీచ్ పై మరింత ఆసక్తి నెలకొంది. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ అలాగే కింగ్ నాగార్జునలపై రాజమౌళి ఎలాంటి విషయాలు పంచుకుంటారు అనేది ప్రత్యేకంగా ఉండనుంది అని చెప్పాలి. మరి జక్కన్న నుంచి ఎలాంటి స్పీచ్ ఉంటుందో చూడాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ జూన్ 20న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.