లాక్ డౌన్ కారణంగా చాలా మంది దర్శకులకు తమ స్క్రిప్టులను బెటర్ మెంట్ చేసుకోవడానికి మంచి సమయం దొరికింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కూడా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసారట. ఫారెన్ లో షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలను ఇండియాలోనే షూట్ చేసేలా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట. లాక్ డౌన్ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.
ఇక ఈ లాక్ డౌన్ సమయంలో కూడా టైమ్ సేవ్ చెయ్యడం కోసం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ తాలూకు ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమా తెలుగు హిందీ మరియు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.