పవన్ సినిమాతో ప్రభాస్ ట్రీట్ ఖాయమేనట!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత థియేటర్స్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సాలిడ్ పీరియాడిక్ చిత్రం రిలీజ్ దగ్గరకి వస్తుండగా మరో క్రేజీ న్యూస్ ఇపుడు వినిపిస్తుంది. ఇదే సినిమాతో డార్లింగ్ హీరో ప్రభాస్ నుంచి క్రేజీ ట్రీట్ ని లాక్ చేసినట్టు గట్టి టాక్ వినిపిస్తుంది.

దర్శకుడు మారుతీతో చేస్తున్న సినిమా ది రాజా సాబ్ తాలూకా టీజర్ ని హరిహర వీరమల్లు ప్రింట్స్ తో అటాచ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం ఇద్దరు ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. దీనిపై హీరోయిన్ రెండు సినిమాల హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఖాయమే అనుకోవాలి. ఇక వీరమల్లు సినిమా ఈ జూన్ 12న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version