మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ముగ్గురు దర్శకులతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చర్చించడం జరిగింది అని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ ని తెలుగు రీమేక్ బాధ్యతలు దర్శకుడు సుజీత్ కి ఇవ్వడం జరిగింది అన్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా లూసిఫర్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో సుజీత్ ఉన్నారు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్, బాబీలతో కూడా చిరంజీవి కథా చర్చలలో పాల్గొన్నడం జరిగిందని చెప్పారు.
ఈ ముగ్గురిలో చిరంజీవి తన తదుపరి మూవీ డైరెక్టర్ బాబీతో కమిట్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాబీ ఇప్పటికే తన మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ చిరంజీవికి వినిపించగా ఆయన పూర్తి సంతృప్తి చెందడంతో పాటు, మూవీ దాదాపు ఓకె చేశారని వినికిడి. దర్శకుడు బాబీ గత ఏడాది వంకటేష్, నాగ చైతన్యలతో వెంకీ మామ అనే చిత్రం తెరకెక్కించగా హిట్ అందుకుంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు.