రెండు రోజుల క్రితం రజిని కాంత్ ఇంటిలో బాంబు పెట్టినట్లు 108 సిబ్బందికి ఫోన్ వెళ్ళింది. దీనితో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగారు. రజిని ఇంటి ఆవరణాన్ని మొత్తం తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఇది ఆకతాయిల పని అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో విచారణ చేపట్టగా, కడలూర్ జిల్లా దగ్గర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు. ఐతే ఈ బాలుడు మానసిక స్థితి సరిగా లేదని పోలీసులకు విచారణలో తెలిసింది. మెడికల్ స్టేట్మెంట్స్ పరిశీలించిన అనంతరం అతడిని వదిలిపెట్టారు. ఓ 13ఏళ్ల ఆకతాయి పని అందరికీ చెమటలు పట్టించింది.