మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఫుల్ ఫామ్ లోకి వచ్చి అదరగొడుతున్న వారిలో నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు. వరుస భారీ హిట్స్ తో బాలయ్య వెర్షన్ 2.0 ఇపుడు కొనసాగుతుంది. ఇక ఈ సినిమాలు ట్రీట్ మాత్రమే కాకుండా తనకి ఉన్నత పురస్కారం పద్మభూషణ్ కూడా రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరి దీనితో బాలయ్య సోదరి అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన అన్నయ్య అందుకున్న గౌరవానికి గాను లేటెస్ట్ గా గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఇందులో సినీ సహా రాజకీయ నాయకులు కూడా పాల్గొనగా వారిలో బాలయ్యతో క్రేజీ హిట్ “వీరసింహా రెడ్డి” ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా హాజరు కావడం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఫోటో దిగి ఆ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. చంద్రబాబు గారితో ఒక మెమొరబుల్ సాయంత్రం చాలా ఆనందం కలిగించింది అని చంద్రబాబు గారు తన భుజంపై చెయ్యి వేసి మరీ ఫోటో దిగారు. దీనితో ఈ పిక్ వైరల్ గా మారింది.
Had the honor of spending a memorable evening with the visionary leader, CM Shri @ncbn garu, celebrating the remarkable achievement of our beloved #NandamuriBalakrishna garu on receiving the prestigious #PadmaBhushan, in an event organized by #Bhuvaneshwari garu. pic.twitter.com/MC8BvUYXl4
— Gopichandh Malineni (@megopichand) February 2, 2025