జనం థియేటర్లకు రావడం లేదు – తెలుగు డైరెక్టర్

ఇటీవల కాలంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదని తెలుగు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నారు. ఆయన తొలిసారి ‘చౌర్యపాఠం’ చిత్రంతో నిర్మాతగా మారారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

గతంలో మాదిరిగా జనం థియేటర్లకు రావడం లేదని.. సెకండ్ షోలు చూసేందుకు ఎవరూ ఆసక్తిని చూపడం లేదని..చాలా ప్రాంతాల్లో సెకండ్ షోలు క్యాన్సిల్ చేస్తున్నారని.. తాను ఈ పరిస్థితిని స్వయంగా చూశానంటూ త్రినాథరావు కామెంట్ చేశారు. ఇలాంటి సమయంలో ఓ కొత్త టీమ్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే చాలా భయంగా ఉందని ఆయన అన్నారు.

ఇక చౌర్యపాఠం మూవీలో కొత్తవారు ఉన్నా, కథ అందరికీ నచ్చే విధంగా ఎంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని అనుకున్నా, పై కారణాలతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నామని.. జనం థియేటర్లకు రాకపోవడానికి ఒక్క ఐపీఎల్ మాత్రమే కారణం కాదు.. ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

Exit mobile version