గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. కేవలం టైటిల్ గ్లింప్స్తోనే ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీపై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. అయితే, తాజాగా ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ కోర్టు ఝలక్ ఇచ్చింది.
గతంలో ఏఆర్ రెహమాన్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమాలోని ‘వీరా రాజ వీరా’ అనే పాటకు రెహమాన్ సంగీతాన్ని కాపీ కొట్టారని ఢిల్లీ హైకోర్టులో సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డగర్ పిటీషన్ వేశాడు. తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి రెహమాన్ సంగీతాన్ని కాపీ కొట్టారని ఆయన ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఏఆర్ రెహమాన్, మద్రాస్ టాకీస్ పిటీషన్దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రెహమాన్ ఆ సినిమాకు కాపీ ట్యూన్ వాడారని.. మరి ఇప్పుడు పెద్ది కోసం ఎలాంటి ట్యూన్స్ వాడుతాడా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.