కరోనా హీరోలకు.. పవన్, ఎన్టీఆర్, చరణ్ అండ్ ఇతర స్టార్స్ వందనం !

కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. ఈ క్రమంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాని చెప్పినట్లుగానే అందరూ చప్పట్లు కొట్టారు. కరోనావైరస్ నుండి 1.3 బిలియన్ల భారతీయులను రక్షించడానికి వైద్యులు, ఆరోగ్య మరియు పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిస్వార్థమైన పనికి భారతీయులు అందరూ చప్పట్ల రూపంలో కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది టాలీవుడ్ తారలు కూడా చప్పట్లు కొట్టారు మరియు ఆరోగ్య నిపుణులకు నమస్కరించారు.

కాగా పవన్ కళ్యాణ్ మరియు ఎన్.టి.ఆర్ వారి నివాసాల వద్ద గంట మోగించగా, రామ్ చరణ్ అతని బాల్కనీ నుండి చప్పట్లు కొట్టారు, బన్నీ ఫ్యామిలీ కూడా టెర్రసా పైకి వచ్చి మరి చప్పట్లు కొట్టారు. ఘోరమైన ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదురుకొవాలి. జనతా కర్ఫ్యూ ని విజయవంతం జరుగుతుంది. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి మరియు సామాజిక దూరం పాటించాలి.



https://twitter.com/AmbatiRambabu/status/1241693001140842501?s=19












Exit mobile version