ఇరవై ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. అటు ఓజి కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ పవన్ బిజీ అయ్యాడు. అయితే, పవన్ తన కెరీర్‌లో ఇరవై ఏళ్ల తర్వాత ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేస్తున్నాడు.

పవన్ సినిమా కెరీర్‌లో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వచ్చిన సందర్భం చాలా అరుదు. ఒక్క 2006 సంవత్సరంలో మాత్రమే పవన్ ఏడు నెలల గ్యాప్‌లో ‘బంగారం’, ‘అన్నవరం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాల రిజల్ట్ విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు మళ్లీ ఇలాంటి సీన్ రిపీట్ చేస్తున్నాడు.

2025లో కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే పవన్ హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ డేట్ అటుఇటు అయినా, ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కావడం ఖాయం. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత పవన్ అరుదైన రికార్డు రిపీట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version