మహేష్ ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లేనా ?

మహేష్ ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లేనా ?

Published on Mar 3, 2020 11:04 AM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న పరుశురామ్, తన తరువాత సినిమాని నాగ చైతన్యతో ఫిక్స్ చేశాడని తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనే ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఎలాగూ వంశీ పైడిపల్లితో సినిమాను క్యాన్సల్ చేసుకున్న మహేష్.. పరుశురామ్ కథకు ఓకే చెప్పాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పరుశురామ్ మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజా వార్తలు