ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న ‘వార్-2’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తన 31వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్.

అయితే, ఇప్పుడు ఈ చిత్రాల షూటింగ్‌కు బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version