ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా నేపథ్యం అదేనా ?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, ఆ తరువాత అల్లు అర్జున్ తో ‘అలవైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తరువాత, మళ్లీ తన తర్వాతి చిత్రాన్ని కూడా మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం కథా నేపథ్యంగా పల్నాడు ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ అని.. సినిమాలో ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్ మెన్ లా నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి.

అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. అయితే సినిమా మొత్తం తారక్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా లేక ప్లాష్ బ్యాక్ లో సెకెండ్ రోల్ వస్తోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. మెయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తే.. జాన్వీకి మంచి లాంచింగ్ అవుతుంది.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి నుండి మొదలుపెట్టాలని చూస్తున్నారు.

Exit mobile version