మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. పైగా ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా
ఈ సినిమా కథ ఐడియా పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘కన్నప్ప’ సినిమా ఏడెనిమిదేళ్లుగా తన ప్లానింగ్లో ఉందని.. అయితే, బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని.. అలాగే అసలు ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని హీరో మంచు విష్ణు చెప్పారు.
కాగా ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు. ఇది భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్బాబు ఓ సందర్భంలో అన్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించారు.