తెలుగు సినిమాలో కొత్త టెక్నాలజీకి శ్రీకారం

తెలుగు సినిమాలో కొత్త టెక్నాలజీకి శ్రీకారం

Published on Jan 18, 2013 8:31 AM IST


80 ఏళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త కొత్త టెక్నాలజీ తెలుగు సినిమాని ముందుకి తీసుకు వెళ్తున్నాయి. ఫౌండ్ ఫూటేజ్ టెక్నాలజీతో తొలిసారిగా తెలుగులో ‘కేస్ నెం.666/2013’ అనే సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్లో ‘పారానార్మల్ ఆక్టివిటీ’, బాలీవుడ్లో రాగిణి ఎంఎంఎస్, లవ్ సెక్స్ ఔర్ ధోకా సినిమాలు ఈ ఫౌంద్ ఫూటేజ్ తో తెరకెక్కాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీని తెలుగుకి పరిచయం చేయబోతున్నాము అని దర్శకుడు వెంకట్ సిద్ధార్థ్ రెడ్డి అన్నాడు. దెయ్యాలు లేవు అని నిరూపించడానికి ముగ్గురు యువకులు అడివిలో ఉన్న ఒక పాడుబడ్డ భవంతిలోకి వెళ్లి అక్కడ తమ అనుభవాలు చిత్రీకరిస్తారు. ఆ తరువాత వారిలో ఒక్కొక్కరు మాయమవుతుంటారు. ఇవన్ని కెమెరాల్లో రికార్డు అవుతాయి. ఆవారు ఎలా మాయమయ్యారు అనేది సినిమా మిగతా కథ. డిసెంబర్ 23న షూటింగ్ ప్రారంభించాం. జనవరి 25న విడుదల చేస్తాం. ‘జింగ్రీల్’ ద్వారా ఇంటర్నెట్లో అందరూ ఈ సినిమాని వీక్షించేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు