మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మించారు. ఐతే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ వేడుకలో మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మంచు మనోజ్ను ఉద్దేశించి నారా రోహిత్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇంతకీ, నారా రోహిత్ ఏం పోస్ట్ చేశారంటే.. ‘మా భైరవం చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేసిన ఫ్యాన్స్, ఏలూరు ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్లో మనోజ్ పవర్ఫుల్ స్పీచ్ హైలెట్గా నిలిచింది’ అని చెప్పుకొచ్చిన రోహిత్, మనోజ్ ను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ.. ‘మనోజ్ స్పీచ్ నాకు కూడా ఇన్ స్పైర్ గా అనిపించింది. బాబాయ్ ఏదేమైనా కానీ, నీ కోసం నేనుంటాను. లవ్ యూ’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. రోహిత్, మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన భైరవం చిత్రం మే30న ప్రేక్షకుల ముందుకురానుంది.