‘వి’ కథ ముగింపులోనే మరో కథ మొదలవుతుందట !

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వి’. కాగా ఘోరమైన కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా ఎండింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కథ ముగిసిన చోట నుండే కథను కొనసాగించవచ్చు అట. అంటే ఈ సినిమాకి సీక్వెల్ టైపు అన్నమాట. మొత్తానికి ఈ చిత్రానికి సీక్వెల్ ఉండటానికి అవకాశం ఉంది. మరి ఈ సినిమాకొచ్చే సక్సెస్ ను బట్టి సీక్వెల్ చేయాలా వద్దా అని డిసైడ్ చేయనున్నారు.

ఇక ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు. అలాగే సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. ఇక హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్రంగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

Exit mobile version