ఓటిటిలోకి నాని లేటెస్ట్ థ్రిల్లర్.. పాన్ ఇండియా ఆడియెన్స్ కి ట్రీట్

ఓటిటిలోకి నాని లేటెస్ట్ థ్రిల్లర్.. పాన్ ఇండియా ఆడియెన్స్ కి ట్రీట్

Published on Apr 11, 2025 8:01 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా తాను నిర్మాణం వహించిన చిత్రమే “కోర్ట్”. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా మరో యువ నటీనటులు హర్ష రోహన్ అలాగే శ్రీదేవిలు మెయిన్ లీడ్ లో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్ట్ థ్రిల్లర్ సాలిడ్ హిట్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది.

ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఈ చిత్రం ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి బేబి సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నటుడు శివాజీ సాలిడ్ రోల్ ని చేసిన సంగతి తెలిసిందే.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు