అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ చిత్రం ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 25 వరకు బాదామి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తుండగా సాయికృప ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గడ్డంతో కనిపించడానికి నాగార్జున ఆయన ఆహార పద్ధతులు మరియు లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. నాగార్జున గతంలో ‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ వంటి రెండు భక్తిరస చిత్రాలు తీసి విజయవంతమయ్యారు. ఆ రెండు చిత్రాలను కూడా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు నాగార్జున అభిమానుల్లో కూడా అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్న శిరిడి సాయి
కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్న శిరిడి సాయి
Published on Feb 10, 2012 9:00 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?