మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అనారోగ్యం పాలయ్యారంటూ మంగళవారం రోజున పలు వెబ్సైట్స్, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కారణంతోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చారని.. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారంటూ ఈ వార్తలు పేర్కొన్నాయి.
అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మెగా బ్రాదర్ నాగబాబు తాజాగా స్పందించారు. తమ తల్లిగారు ఆరోగ్యంగా ఉన్నారని.. ఆమె అనారోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన ఈ సందర్భంగా మరోసారి కోరారు.
గతంలోనూ ఇదే విధంగా అంజనాదేవి ఆరోగ్యంపై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ వార్తలు సోషల్ మీడియాలో వినిపించడంతో మెగా బ్రదర్ సీరియస్ అయ్యారు.