ప్రభాస్ డైరెక్టర్ మెదడులో ఇంత వైలెంట్ ఐడియానా?

మహానటి సినిమాతో దేశం మొత్తం తనవైపు తిరిగేలా చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్. లెజెండరీ యాక్టర్ సావిత్రి కథను అద్భుతంగా ఆవిష్కరించిన నాగ్ అశ్విన్ ప్రేక్షకుల ఆదరణతో పాటు, విమర్శకుల ప్రశంశలు కూడా అందుకున్నారు. కాగా ట్విట్టర్ లో ఆయన వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. సాఫ్ట్ కా కనిపించే నాగ్ అశ్విన్ బుర్ర నుండి ఇంతటి వైలెంట్ ఐడియానా అని అందరు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

విషయంలోకి వెళితే విదేశాలలో వలె ఇండియన్ సినిమా థియేటర్స్ లో ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ఎందుకు సప్లై చేయకూడదు. దీని వలన థియేటర్స్ కి ఆదరణ పెరిగే అవకాశం ఉందనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటని నెటిజెన్స్ ని అడిగారు. ఐతే దీనికి ఎక్కువ మంది నుండి నెగెటివ్ ఆన్సర్ వచ్చింది. కొందరైతే నాగ్ అశ్విన్ ది చెత్త ఐడియా అని కొంచెం ఘాటు రిప్లై లు పెడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version