టాలివుడ్ నిర్మాణ సంస్థలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఎస్.పి.బి

టాలివుడ్ నిర్మాణ సంస్థలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఎస్.పి.బి

Published on Jan 6, 2012 12:43 AM IST

ఇక్కడ ఈరోజు జరిగిన “శ్రీ రామ రాజ్యం” చిత్ర 50 రోజుల వేడుక లో శ్రీ ఎస్.పే.బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వై.సాయిబాబా మన సంస్కృతి మీద చిత్రాన్ని నిర్మించి అందరు నిర్మాతలకు ఆదర్శంగా నిలిచాడు అని అన్నారు. ఇలాంటి చిత్రాలకు కమర్షియల్ అనే పదం లెక్క లోకి రాదూ అని అందరి తారలను ఒక్కచోట చేర్చడం కమర్షియల్ అంశాలను లెక్కచెయ్యకుండా చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ చిత్రం లో పాడటం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పారు.ఈ రోజు నందమూరి అభిమానులకి రెండు ఆనందకరమయిన విషయాలు ఎన్.టి ఆర్ నటించిన “గులేబకావళి కథ” చిత్రం విడుదల అయ్యి 50 సంవత్సరాలు అయ్యింది. బాల కృష్ణ మాట్లాడుతూ ఎన్.టి.ఆర్ గారు తన 52 వ సంవత్సరం లో బాపు గారి చిత్రం లో నటించారు ఇప్పుడు నా వయస్సు కూడా 52 అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు