ప్రఖ్యాత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం తమిళం లో “శ్రీ రామ రాజ్యం” చిత్రం లో బాల కృష్ణ పాత్రకు గాత్రాన్ని ఇస్తున్నారు. ఈ విషయాన్నీ కాసేపటి క్ర్రితం జరిగిన 50 రోజుల వేడుకలో వెల్లడించారు. ఈ వేడుక లో బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ ” ఈ చిత్రం లో బాల కృష్ణ గారికి నా గాత్రాన్ని ఇవ్వటం చాల ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి అద్బుతమయిన చిత్రాన్ని చేసినందుకు బాల కృష్ణ, నయతార, బాపు లకు అభినందనలు”. చిన్మయి ఈ చిత్రం లో నయనతార పాత్రకు గాత్రాన్ని ఇచ్చారు. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం లో త్వరలో విడుదల కానుంది.