ఫిబ్రవరికి వాయిదా పడిన నిప్పు

ఫిబ్రవరికి వాయిదా పడిన నిప్పు

Published on Jan 1, 2012 4:30 PM IST

రవితేజ-దీక్షా సేథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నిప్పు’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. వై.వి.ఎస్ చౌదరి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రవితేజ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఫిలిం ఇండస్ట్రీలో చాన్సుల కోసం తిరిగే రోజుల్లో రవితేజ, గుణశేఖర్ మరియు వై.వి.ఎస్ చౌదరి ముగ్గురూ ఒకే గదిలో ఉండేవారు. ఇప్పుడు ఈ ముగ్గురూ మిత్రులు కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ప్రకటించిన రోజు నుండి ఇండస్టీ వర్గాల్లో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు